ఎనర్జిటిక్ హీరో రామ్, డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన “ఇస్మార్ట్ శంకర్” గురువారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. “ఇస్మార్ట్ శంకర్” చిత్రంలో రామ్ సరసన నభా నటేష్, నిధి అగర్వాల్ హీరోయిన్లుగా నటించగా మణిశర్మ సంగీతం అందించాడు. ఈ చిత్రం ఫస్ట్ షో నుంచే మంచి టాక్ సొంతం చేసుకుంది. మొదటి రోజు సినిమాకు భారీగానే కలెక్షన్లు వచ్చాయి. పలువురు ప్రముఖులు, అభిమానులు సోషల్ మీడియా ద్వారా చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రం రెండు రోజులకి గాను 25 కోట్ల గ్రాస్ వసూళ్ళని రాబట్టిందని టీం చెబుతుంది. పూరి మార్క్ హీరోయిజం కి రామ్ ఎనర్జీ తోడవ్వడంతో సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ విజయం సాధించింది.
ఈ నేపథ్యంలో రామ్ గోపాల్ వర్మ చేసిన రచ్చ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. తన శిష్యుడు పూరీ జగన్నాథ్ దర్శకత్వం వహించిన ఇస్మార్ట్ శంకర్ బంపర్ హిట్ కావడంతో సంచలన దర్శకుు రామ్ గోపాల్ వర్మ ఆనందానికి అవధులు లేకుండా పోయింది. నిన్న రాత్రి ఇస్మార్ట్ శంకర్ యూనిట్ అంతా కలిసి చేసుకున్న సక్సెస్ పార్టీలో ఆర్జీవీ రెచ్చిపోయాడు. ఏకంగా షాంపెయిన్ తో తల స్నానం చేసి, పక్కనే ఉన్న చిత్ర నిర్మాత చార్మిని గట్టిగా కౌగిలించుకొని ఆర్జీవీ రచ్చ…రచ్చ చేశాడు. అంతే కాదు దర్శకుడు పూరీ జగన్నాథ్ ను ముద్దు కూడా పెట్టుకొని రాము తన సంతోషాన్ని పంచుకుంటూ ఆ ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
తాజాగా రామ్ గోపాల్ వర్మ హైదరాబాద్ సిటీ పోలీసులకు ‘ఇస్మార్ట్ శంకర్’ సాక్షిగా సవాల్ విసిరాడు. ఈ సందర్భంగా రామ్ గోపాల్ వర్మ ..తన శిష్యులైన మరో ఇద్దరు డైరెక్టర్లు..ఆర్.ఎక్స్ 100 డైరెక్టర్ అజయ్ భూపతి, ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమాను వర్మతో డైరెక్ట్ చేసిన అగస్త్య మంజుతో కలిసి బుల్లెట్ బండిపై హెల్మెట్ లేకుండా త్రిపుల్ రైడ్తో హైదరాబాద్,మూసాపేటలోని శ్రీరాములు థియేటర్కి ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమాను వెళ్లాడు. ఈ సందర్భంగా తాను త్రిపుల్ రైడింగ్తో సినిమా థియేటర్కు వచ్చిన ఫోటోను ట్విట్టర్లో పోస్ట్ చేసాడు. ఇపుడీ ఫోటో సోషల్ మీడియలో వైరల్ అవుతుంది. గతంలో ఇదే ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమా షూటింగ్ సందర్భంగా చార్మినార్ దగ్గర రామ్ సిగరెట్ స్మోక్ చేసాడు. ఆ తర్వాత చార్మినార్ పోలీసులు రామ్కు జరిమానా విధించారు. మరి వర్మ చేసిన పనికి పోలీసులు ఎలా స్పందిస్తారో చూడాలి.