ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. కరోనా కారణంగా వాయిదా పడిన ఈ సినిమా షూటింగ్ ఇటీవలే తిరిగి ప్రారంభించారు. ఈ సినిమాలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కీలక పాత్రలో నటిస్తున్నాడు.కాజల్ చిరంజీవికి జోడీగా నటిస్తుంది. ఆచార్య టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ నవంబర్ 20 నుంచి హైదరాబాద్ పరిసరప్రాంతాల్లో జరగనుంది. ఇటీవల చిరంజీవికి కరోనా పాజిటివ్ అంటూ నిర్ధారణ అవ్వడంతో అభిమానులంతా కాస్త ఆందోళన చెందారు. ఆతర్వాత కొద్దిరోజులకే నెగిటివ్ రావడంతో అభిమానులంతా ఊపిరి పీల్చుకున్నారు. అయితే… ఈ సినిమా గురించి మరో అప్డేట్ వచ్చింది. ఆచార్య మూవీలో కోలీవుడ్ హ్యాండ్ సమ్ హీరో చిరుతో కయ్యానికి సై అంటున్నారట. ఇంతకీ ఆ హీరో ఎవరో కాదు… తమిళ స్టార్ అరవింద్ స్వామి. తెలుగులో రామ్ చరణ్ మూవీ ధృవలో అరవింద్ స్వామి విలన్గా అదరగొట్టిన విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు చిరంజీవి తాజా సినిమాలో కూడా అరవింద్ స్వామి విలన్గా నటించబోతున్నాడట. దీనిపై త్వరలోనే క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. చూడాలి మరి ఏం జరుగుతుంది అనేది.
previous post
next post