స్టార్ హీరోయిన్ సమంత, నయనతార, విజయ్ సేతుపతి కలిసి నటించిన కోలీవుడ్ చిత్రం కాతువాకుల రెండు కాదల్. తెలుగులో ‘కణ్మణి రాంబో ఖతీజా’ అనే పేరుతో విడుదల కానుంది. ట్రయాంగిల్ ప్రేమకథతో రొమాంటిక్ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రానికి నయనతార ప్రియుడు విగ్నేష్ శివన్ దర్శకత్వం వహించారు.
గురువారం ఈ సినిమా షూటింగ్ పూర్తయిన సందర్భంగా సెట్స్లో చిత్ర బృందం సందడి చేసింది. హీరోహీరోయిన్లు, దర్శకుడు కేక్ కట్ చేసి ఒకరికొకరు తినిపించుకున్నారు .దీనికి సంబంధించి సమంత కొన్ని ఫోటోలను పంచుకున్నారు. ఇటీవల ఈ సినిమా నుంచి రెండు అనే పాట విడుదలై మంచి ఆదరణ పొందింది.
ఈ చిత్రం నిర్మాణాంతర కార్యక్రమాలు శరవేగంగా పూర్తి చేసుకుని తెలుగు, తమిళ భాషల్లో ఏప్రిల్ 28న విడుదల కానుంది. అనిరుధ్ సంగీతం అందిస్తున్నారు .
సమంత నటిస్తున్న ఇతర సినిమాల విషయానికి వస్తే.. టాలీవుడ్ డైరెక్టర్ గుణశేఖర్ శాకుంతలం అనే ఓ పౌరాణిక చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా ఇటీవల షూటింగ్ పార్ట్ను పూర్తి చేసుకుంది. ఈ చిత్రాన్ని గుణ శేఖర్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. అలాగే యశోద సినిమాలతో పాటు సామ్ హిందీలో ఓ వెబ్సిరీస్ చేస్తున్న సంగతి తెలిసిందే.