తాజాగా రకుల్ ప్రీత్ సింగ్ సౌత్ ఇండస్ట్రీపై చేసిన కొన్ని కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఐదేళ్ల పాటు తెలుగులో టాప్ హీరోయిన్గా చక్రం తిప్పిన రకుల్ ఇప్పుడు బాలీవుడ్పై ఫోకస్ చేసింది. ముంబైలోనే మకాం మార్చేసి అక్కడే సినిమాలు చేసుకుంటుంది ఈ ముద్దుగుమ్మ. ఇందులో భాగంగానే దక్షిణాది ఇండస్ట్రీపై.. ఇక్కడి హీరోలపై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది. తన కెరీర్ ఆరంభంలో చాలా అవకాశాలు వచ్చినట్లే వచ్చి చేజారిపోయాయని బాధ పడింది రకుల్. అయితే తాను చేయాల్సిన సినిమాలు ఇతర హీరోయిన్లు చేసినా కూడా చాలా వరకు అవి ఫ్లాప్ అయ్యాయని చెప్పుకొచ్చింది ఈమె. ఇక హీరోయిన్స్ పారితోషికం గురించి కూడా నోరు విప్పింది రకుల్. ఈ విషయంలో మాత్రం చాలా మెచ్యూర్డ్గా ఆలోచించింది రకుల్. హీరో, హీరోయిన్ సేమ్ వాళ్లు కష్టపడినట్లే మేం కూడా కష్టపడుతున్నాం. దక్షిణాది ఇండస్ట్రీలో హీరోయిన్ల కంటే హీరోలకు ఎక్కువగా ఇమేజ్ ఉంటుందని వాళ్లను చూడ్డానికి థియేటర్స్కు ప్రేక్షకులు వస్తారనే నిజాన్ని చెప్పింది రకుల్. అందుకే సౌత్లో హీరోలకు భారీ రెమ్యునరేషన్ ఉంటుందని చెప్పింది ఈమె. ఈ లాజిక్ తెలుసు కాబట్టే తను కూడా ఎప్పుడూ పారితోషికం కోసం బెట్టు చేయలేదని రకుల్ క్లారిటీ ఇచ్చింది.
previous post
మాజీ బాయ్ ఫ్రెండ్ తో దీపికా ఫోటో… “క్యూట్” అంటున్న భర్త