telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు

భార్యకు చందమామపై ల్యాండ్ కొనిచ్చిన భర్త…

చిన్నపిల్లలకు చందమామను చూపిస్తూ పాటలు పాడుతుంటారు.. ఇక, చిన్నారుల నుంచి ప్రేయసి, భార్యను ఇలా ఎవ్వరినైనా జాబిలమ్మతో పోలుస్తుంటారు.. ప్రేమికులు, దంపతుల మధ్య వచ్చిన అకల్లో సైతం జాబిలమ్మను మధ్యలోకి లాగారు మన కవులు.. అయితే, ఓ వ్యక్తి భార్యపై తనకున్న ప్రేమ ఆకాశమంత ఎంతు అంటున్నాడు.. జాబిలమ్మ లాంటి తన భార్యకు ఏకంగా చందమామపై ల్యాండ్ కొనిచ్చి.. ప్రేమను చాటాడు.. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. రాజస్థాన్‌కు చెందిన ధర్మేంద్ర అనిజ, సప్నా అనిజ దంపతులు డిసెంబరు 24న తమ ఎనిమిదో వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకున్నారు.. తాను ఎంతగానో ప్రేమించే భార్య కోసం ఏదైనా అద్భుతమైన గిఫ్ట్ ఇవ్వాలని ప్లాన్ చేసిన ధర్మేంద్ర… ప్రతి ఒక్కరూ కార్లు మరియు ఆభరణాలు వంటివి బహుమతిగా ఇస్తారు, కానీ, నేను ఏదైనా వెరైటీగా ఈయాలనుకున్నాడు.. దాంతో.. నేను ఆమె కోసం చంద్రునిపై భూమిని కొనుగోలు చేశానని తెలిపారు. అమెరికా న్యూయార్క్ నగరంలోని లూనా సొసైటీ ఇంటర్నేషనల్ అనే సంస్థ ద్వారా ధర్మేంద్ర ఈ భూమిని కొన్నాడు. ఈ ప్రక్రియ పూర్తి కావడానికి దాదాపు ఏడాది సమయం పట్టిందని వెల్లడించాడు.. నేను చాలా సంతోషంగా ఉన్నారు.. రాజస్థాన్‌ నుంచి చంద్రునిపై భూమి కొన్న మొదటి వ్యక్తి నేను అని అనుకుంటున్నానంటూ ఆనందాన్ని మీడియాతో పంచుకున్నాడు. ఇక, ఈ ఊహించని పరిణామంతో ఆయన భార్య సప్నా ఆనందానికి అవదులు లేకుండా పోయాయి.. తన భర్త నుంచి ప్రపంచం వెలుపల ఇంత అద్భుతమైన బహుమతిని అందుకుంటానని తాను ఎప్పుడూ ఊహించలేదని చెబుతుంది. ఇక, ఈ సందర్భంగా పార్టీని ప్రొఫెషనల్ ఈవెంట్ నిర్వాహకులు నిర్వహించారు, ఓ సెట్టింగ్ వేసి.. ఏకంగా చంద్రుడిపై ఉన్నట్టు అనిపించేలా చేశారు.. ఆ వేడుకలో ధర్మేంద్ర.. ఆస్తి పత్రం యొక్క ఫ్రేమ్డ్ సర్టిఫికేట్‌ను బహుమతిగా సప్నాకు ఇచ్చాడు.

Related posts