telugu navyamedia
క్రైమ్ వార్తలు వార్తలు

ముంబైలో దారుణం.. రైల్లో యువతీ పై

rape

ఎన్ని చట్టాలు తీసుకొచ్చిన మహిళలకు రక్షణ ఉండటం లేదు. ఓ 25 ఏళ్ల యువతిపై గుర్తుతెలియని దుండగుడు అత్యాచారానికి  పాల్పడమే కాకుండా హతమార్చేందుకు ప్రయత్నించాడు. ఈ ఘటన నవీ ముంబైలో జరిగింది.ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి చూసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం థానే జిల్లాలోని టిట్వాలా నివాసి అయిన యువతి.. ముంబయిలోని పోవారులో పనిచేస్తుంటారు. వారం ఒకసారి తన సొంత ఇంటికి వెళ్లి వస్తుంటారు. ఆ విధంగా గత ఆదివారం ఇంటికి వెళ్లి.. మరుసటి రోజు పోవారుకి వచ్చేసింది. కాగా, తాను ఇంటి నుండి తిరిగి వచ్చినప్పటికీ.. ఎటువంటి సమాచారం తల్లిదండ్రులకు తెలియలేదు. మంగళవారం సాయంత్రం ఉదయం 6 గంటల సమయంలో వశీ రైల్వే బ్రిడ్జి వద్ద పట్టాలపై ఆ యువతి అపస్మారక స్థితిలో పడి ఉండటాన్ని రైల్వే సిబ్బంది చూశారు. అయితే వైద్యపరీక్షల్లో యువతిపై అత్యాచారం జరిగినట్లు తేలింది. అంతే కాకుండా ఆమెను వేగంగా వెళుతున్న రైల్లోంచి తోసేయడం వలనే ఇంత తీవ్రంగా గాయపడి వుంటుందన్నారు. ప్రస్తుతం యువతి మాట్లాడే పరిస్ధితుల్లో లేదని… ఆమే కోలుకున్నాక ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకుంటామని పోలీసులు తెలిపారు. చుడాలిమరి ఈ ఘాతకుడు ఎప్పుడు అరెస్ట్ అవుతాడు అనేది.

Related posts