కనీసం భౌతిక దూరం కూడా పాటించకుండా అడవి మనుషుల్లా ప్రవర్తిస్తున్నారు కొంతమంది మనుషులు. అలాంటివారు వీటిని చూసైనా నేర్చుకోవాలి. జంతువులం మేమే భౌతిక దూరం పాటిస్తున్నాం. మనుషులు మీకేమైంది? అన్నట్లుగా ఉన్న ఈ ఫొటోను కేంద్ర మంత్రి కిరెన్ రిజిజు ట్వీట్ చేశారు. అరుణాచల్ ప్రదేశ్లోని భాలుక్పాంగ్లో ఈ అరుదైన దృశ్యం కనిపించింది.ఓ వ్యక్తి కోతుల కడుపు నింపేందుకు అరటి పండ్లు, పుచ్చకాయలను రోడ్డుపై పెట్టాడు. వాటిని తినేందుకు వచ్చిన కోతులు దూరం దూరంగా కుర్చున్నాయి. వాటిలో కొన్ని కోతులు పండ్లు తింటుంటే.. మిగతా కోతులు వాటి కోసం ఎంతో ఓర్పుగా ఎదురుచూస్తున్నాయి. దీంతో ఈ ఫొటో క్షణాల్లో వైరల్గా మారింది. ఎంతోమంది ఈ కోతులకు ఉన్నంత బుద్ధి మనుషులకు కూడా ఉంటే బాగుంటుందని కామెంట్స్ పెడుతున్నారు.
A perfect #SocialDistancing seen near Bhalukpong in Arunachal Pradesh along Assam-Arunachal boundary. If we observe carefully, animals can teach us many vital lessons that we may have missed in the haste of our normal daily lives.
(Picture taken by Arup Kalita, Tezpur) pic.twitter.com/5iIr8SELUz— Kiren Rijiju (@KirenRijiju) April 28, 2020