telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

ఫెడరల్ ప్రంట్ పేరుతో కేసీఆర్‌ తీర్థయాత్రలు: పొన్నం

PCC Ponnam comments KCR Federal Front

తెలంగాణ సీఎం కేసీఆర్‌ ఫెడరల్ ప్రంట్ పేరుతో తీర్థయాత్రలు తిరగుతున్నారని టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ పొన్నం ప్రభాకర్‌ అన్నారు. మల్లన్న సాగర్‌ భూ నిర్వాసితులకు న్యాయం చేయాలంటూ మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి చేపట్టిన ఆమరణ నిరాహార దీక్షకు పొన్నం సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతుల పట్ల ప్రభుత్వం తన వైఖరి మార్చుకోవాలని సూచించారు. ప్రాజెక్టులకు తమ పార్టీ వ్యతిరేకం కాదని పేర్కొన్నారు.

భూ నిర్వాసితులకు న్యాయం చేయాల్సిన ప్రభుత్వానిదేనన్నారు. ప్రాజెక్ట్ పనులలో జాప్యం చేస్తూ ఆ నిందలు కాంగ్రెస్ పార్టీపై మోపుతున్నారని మండిపడ్డారు. ఈ ప్రాజెక్టుల నిర్మాణం పూర్తయి, రైతుల భూములు సస్య శ్యామలం అవుతాయని అన్నారు. భూనిర్వాసితులకు కూడా ప్రభుత్వం న్యాయం చేయాలని డిమాండ్‌ చేశారు.హైకోర్టు స్టేతో ఆగిపోయిన ప్రాజెక్ట్ పనులను, నిర్వాసితులను భయబ్రాంతులకు గురిచేసి ప్రభుత్వం పూర్తి చేస్తోందని దుయ్యబట్టారు. ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గంలో రైతులు ఆత్మహత్యా యత్నం చేయడం దారుణమని పొన్నం మండిపడ్డారు.

Related posts