telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

ముఖేశ్ కుమార్ మీనాకు .. గవర్నర్ కార్యదర్శిగా .. అదనపు బాధ్యతలు..

mukesh kumar as Secretary to Governor

బిశ్వ భూషణ్ హరిచందన్ ఏపీకి నూతన గవర్నర్ గా నియమించిన విషయం తెలిసిందే. ఆయనకు విజయవాడలోని పాత సీఎం క్యాంపు కార్యాలయాన్ని కేటాయించారు. ఆ కార్యాలయాన్ని రాజ్ భవన్ గా మార్పు చేయనున్నారు. ఈ మేరకు ఏపీ ప్రభుత్వం నోటిఫికేషన్ కూడా జారీ చేసింది. తాజాగా, గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శిగా ఉన్న ముఖేశ్ కుమార్ మీనాకు గవర్నర్ కార్యదర్శిగా అదనపు బాధ్యతలు అప్పగించారు.

ఈ సందర్భంగా ముఖేశ్ కుమార్ మీనా మాట్లాడుతూ, రేపటి నుంచి రాజ్ భవన్ భద్రతను పెంచుతామని అన్నారు. భవనం గ్రౌండ్ ఫ్లోర్ లో ఆఫీసు రూమ్, మొదటి అంతస్తులో గవర్నర్ నివాసం ఉంటుందని చెప్పారు. ఈ నెల 23న బిశ్వభూషణ్ తిరుపతికి వెళ్తారని, అదే రోజు సాయంత్రానికి విజయవాడలోని రాజ్ భవన్ కు చేరుకుంటారని చెప్పారు. ఈ నెల 24న ఉదయం పదకొండు గంటల తర్వాత గవర్నర్ గా ఆయన ప్రమాణస్వీకారం చేస్తారని చెప్పారు.

Related posts