telugu navyamedia
వార్తలు సామాజిక

క్రిస్మస్ వేడుకల్లో విషాదం.. కొబ్బరి వైన్ తాగి 11 మంది మృతి

cocnut wine philippins

ఫిలిప్పీన్స్ లో కొబ్బరి వైన్ సేవించి 11 మంది మృతి చెందారు. దక్షిణ మనీలాలో జరిగిన ఓ క్రిస్మస్ పార్టీ సందర్భంగా అక్కడున్న వారు కొబ్బరి వైన్ ను తాగి తీవ్ర అస్వస్థతకు గురై ప్రాణాలు కోల్పోయారు. మరో 300 మంది ఆసుపత్రిలో చికిత్స పొంది ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు. నగర మేయర్ ఆదేశానుసారం వీరిలో చాలా మందికి ఆసుపత్రిలో వైద్యం అందిస్తున్నారు.

గత గురువారం నుంచి నిన్నటి వరకు ఈ మరణాలు సంభవించాయని మేయర్ తెలిపారు. ఫిలిప్పీన్స్ లో ఈ వైన్ కు ఎంతో ఆదరణ ఉంది. ఫంక్షన్లలో ఈ వైన్ ను విరివిగా స్వీకరిస్తారు. చాలా మంది వీటిని సొంతంగా కూడా తయారు చేసుకుంటుంటారు. అయితే, మిథనాల్ వంటి వాటిని ఈ వైన్ లో కల్పడంతో, ఇది కొన్ని సందర్భాల్లో ప్రాణాంతకంగా మారుతోంది.

Related posts