telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ వార్తలు

వారికి రుణపరిమితిని పెంచిన .. ఆర్బీఐ ..

RBI

భారత రిజర్వ్ బ్యాంక్ (ఆర్.బీ.ఐ) పీర్ టు పీర్ (పీ2పీ) రుణ దాతలకు సంబందించిన పెట్టుబడి పరిమితిని 50 లక్షల రూపాయలకు పెంచింది. ఇది ఈ రంగానికి ఎంతో ఉపశమనం కలిగించే వార్త. ఆర్బీఐ తాజా నిర్ణయం మేరకు అన్ని పీ2పీ ప్లాటుఫార్మ్స్ ఇన్వెస్టర్లు ఈ మేరకు పెట్టుబడి పెట్టడానికి అవకాశం ఉంటుంది. దీని వల్ల మరింత ఎక్కువ మంది వీటి ద్వారా రుణాలను పొందడానికి అవకాశం ఏర్పడుతుంది. ఫలితంగా ఈ రంగం మరింతగా విస్తరిస్తుందని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం అన్ని ప్లాటుఫార్మ్స్ పై రుణాలు తీసుకునే వారికి, ఇచ్చే వారికి సంబంధించిన రుణ పరిమితి 10 లక్షల రూపాయలుగా ఉంది.

పీ2పీ పరిశ్రమ క్రమంగా వృద్ధి చెందుతోంది. ప్రస్తుతం ఆర్బీఐ వద్ద 15కు పైగా పీ2పీ కంపెనీలు నమోదయ్యాయి. ఈ డిజిటల్ ప్లాటుఫార్మ్స్ ద్వారా రుణం అవసరం ఉన్న వారు పొందవచ్చు. ఈ ప్లాటుఫార్మ్స్ రుణదాతలు, రుణ గ్రహీతలకు మధ్య మార్కెట్ ప్లేస్ మాదిరిగా పని చేస్తుంది. ఈ రంగంలోని కంపెనీలు గత కొంత కాలంగా ఈ పరిమితులను పెంచమంటూ పరిశ్రమ డిమాండ్ చేస్తోంది. పరిశ్రమవృద్ధికి అనుగుణంగా పరిమితి పెంపునకు సంబంధించి పీ2పీ కంపెనీలు ఆర్బీఐ కి లేఖ రాశాయి. అంతేకాకుండా ఆర్థిక మంత్రిని కూడా కలిసి పరిమితిని పెంచమంటూ విజ్ఞప్తి చేశారు. ఈ నేపథ్యంలోనే ఆర్బీఐ తాజా నిర్ణయం తీసుకుంది. పరిశ్రమ వృద్ధి సామర్థ్యం, ఈ రంగంపై ఆర్బీఐ కి ఉన్న విశ్వాసమే పరిమితి పెంపునకు దారితీసింది పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. ఆర్బీఐ నిధుల పరిమితిని పెంచడం పరిశ్రమకు ఎంతో సానుకులమైనదని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. ఈ పరిశ్రమ అటు రుణదాతలు, ఇటు రుణగ్రహితలకు ప్రత్యామ్నాయ బ్యాంకింగ్ సొల్యూషన్ గా ఉందని అంటున్నారు. వాస్తవానికి పరిశ్రమ వర్గాలు నిధుల పరిమితిని కోటి రూపాయలకు పెంచాలని కోరాయట. అయితే ఇందులో సగం మేరకు పెంచినప్పటికీ వెంచర్ క్యాపిటల్, ప్రైవేట్ ఈక్విటీ పెట్టుబడులు పెరుగుతాయని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి.

Related posts