telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ

జగన్ పార్టీ అండతోనే ఏపీలో మోదీ సభ: రఘువీరా

ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌ అండతోనే ఏపీలో ప్రధాని మోదీ బహిరంగ సభను ఏర్పాటు చేస్తున్నట్లు పీసీసీ చీఫ్ రఘువీరా అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో   జగన్‌ తో మోదీ కుమ్మక్కయ్యారని ఆయన ఆరోపించారు. మోడీ పర్యటనను వ్యతిరేకిస్తూ నల్లబ్యాడ్జీలు ధరించి రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు చేపడతామని ఆయన తెలిపారు. రేపటి రోజును బ్లాక్ డేగా పాటిస్తామని, ఇందులో తమతో అన్ని పార్టీలు కలిసి రావాలని ఆయన అన్నారు. 
మోడీ పర్యటనను వ్యతిరేకిస్తూ నల్లబ్యాడ్జీలు ధరించి రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు తెలియజేయనున్నట్లు రఘువీరా తెలిపారు. ఏ మొహం పెట్టుకుని మోదీ ఆంధ్రప్రదేశ్ పర్యటనకు వస్తున్నారని ఆయన ప్రశ్నించారు.విభజన హామీలు అమలు చేయడంలో మోడీ విఫలమయ్యారని ఆయన విమర్శించారు. మోదీ పర్యటనను తాము అడ్డుకోబోమని, అది సంస్కృతి కాదని ఆయన అన్నారు. సీడబ్ల్యుసీ  సమావేశం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెట్టాలని ఎఐసీసీ  అధ్యక్షుడు రాహుల్ గాంధీని కోరినట్లు ఆయన తెలిపారు.

Related posts