telugu navyamedia
రాజకీయ వార్తలు

రాబోయే రోజుల్లో నీళ్ల కోసం పోరాడే పరిస్థితి: వెంకయ్య

Venkaiah-Naidu

రాబోయే రోజుల్లో నీళ్ల కోసం పోరాడే పరిస్థితి వస్తుందని ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు అన్నారు.పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లి గూడెం నిట్ స్నాతకోత్సవంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన ఈ సందర్భంగా ప్రసంగించారు. పట్టణాల నుంచి గ్రామస్థాయి వరకు అభివృద్ధి జరగాలని అన్నారు. వ్యవసాయంపై అందరూ దృష్టి పెట్టాలని అన్నారు.

ఆహార ఉత్పత్తిని మరింత పెంచాల్సిన అవసరముందని వెంకయ్య పేర్కొన్నారు. వనరులను సద్వినియోగం చేసుకోవడమే మన పనని వెంకయ్య చెప్పారు. కల్తీలేని విద్యుత్ అందించేలా పరిశోధనలు చేయాలని, పరిశ్రమలతో పాటు పరిశుభ్రమైన వాతావరణం అవసరమని చెప్పారు. మేధాశక్తితో భావి ఇంజనీర్లు దేశ ప్రజల అభివృద్ధికి పాటుపడాలని పిలుపునిచ్చారు.

Related posts