telugu navyamedia
క్రైమ్ వార్తలు వార్తలు సామాజిక

పంటి నొప్పితో ఆసుపత్రికి వెళ్తే… కాపాడాల్సిన డాక్టరే…!?

Pakisthani-Women

పంటి నొప్పితో ఆసుపత్రికి వెళ్తే… ప్రాణాలు కాపాడాల్సిన డాక్టరే కాలయముడై ఆమె ప్రాణాలు తీసేశాడు. పంటినొప్పిగా ఉందని కొరంగి ఆసుపత్రికి వెళ్లిన అస్మత్ జునెజో(22) అనే యువతికి ఆసుపత్రిలోని పనిచేస్తున్న మగ సిబ్బంది మత్తు మందు ఇచ్చారు. ఆమె స్పృహ కోల్పోయాక నలుగురు ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు. నలుగురిలో ఒక డాక్టర్ కూడా ఉండటం గమనార్హం. యువతి కళ్లు తెరిస్తే తమకు ప్రమాదమనుకున్న సిబ్బంది ఆమెకు విషం ఇచ్చి దారుణంగా చంపేశారు. ఎవరికీ ఏ సందేహం రాకుండా ఉండేందుకు ఆంటీబయోటిక్ కారణంగా చనిపోయినట్టు ఆమె బంధువులకు చెప్పారు. పంటినొప్పితో ఆసుపత్రికి వెళ్లిన తన కూతురు చనిపోవడమేంటి ఆమె తల్లి కన్నీరు మున్నీరైంది. ఆసుపత్రి సిబ్బందిపై సందేహంతో పోస్ట్‌మార్టం నిర్వహించగా… రిపోర్టులో అత్యాచారం చేసినట్టు, విషం ఇచ్చి చంపినట్టు తేలింది. దీంతో ఈ వార్త ఒక్కసారిగా వైరల్ అయింది. ఘటనకు కారకులెవరో తెలుసుకుని శిక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనంటూ పాకిస్తాన్ మానవ హక్కుల సంఘ సభ్యుడు అనిస్ హరూన్ అన్నారు. నేరస్థులు షహజైబ్, అమీర్, వలీగా పోలీసులు గుర్తించారు. మరో నేరస్థుడు పరారీలో ఉన్నట్టు అధికారులు తెలిపారు. నేరస్థులను వెంటనే అరెస్ట్ చేసి తగిన చర్యలు తీసుకోవాలని సింధ్ ముఖ్యమంత్రి మురద్ అలీ షా పోలీసులను ఆదేశించారు.

Related posts