పాకిస్థాన్లో రోజురోజుకూ కరోనా కేసుల సంఖ్య పెరుగుతోంది. ఇప్పటివరకు కరోనా పాజిటివ్ కేసులు 4,474కు చేరుకోగా, వైరస్ బారిన పడి 65 మంది మృతి చెందారు. దేశంలోని పంజాబ్ రాష్ట్రంలో అత్యధికంగా 2,224 మందికి కరోనా వైరస్ సోకింది.
సింధ్ ప్రావిన్స్ లో 1,128 మందికి కరోనా పాజిటివ్ వచ్చినట్లు నిర్ధారణ అయింది. 574 మంది బాధితులు కరోనా పాజిటివ్ బారి నుంచి చికిత్స అనంతరం కోలుకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటి వరకు 9,50,080 మంది బాధితులు కరోనా వైరస్ కారణంగా మరణించారు.