పుల్వామా ఉగ్రదాడిపై మాజీ క్రికెటర్, పంజాబ్ మంత్రి సిద్దూ చేసిన వ్యాఖ్యలపై నెటిజన్లు మండిపడుతున్నారు. ఉగ్రవాదానికి మతం, జాతి ఉండదని, కొంతమంది చేసిన పనికి దేశాన్ని మొత్తం నిందిస్తారా అని సిద్దూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. హింసకు పాల్పడిన వారిని శిక్షించాల్సిందేనని తెలిపిన సిద్దు ఇదే సమయంలో ఈ పేరుతో ఒక దేశాన్ని మొత్తం నిందించకూడదని ఆయన అన్నారు. అన్ని దేశాల్లో మంచివారు, చెడ్డవారు ఉంటారని చెప్పారు. సిద్దు చేసిన వ్యాఖ్యలు పాకిస్థాన్ కు వత్తాసు పలుకుతున్నట్టు ఉండటంతో నెటిజన్లు సిద్దూపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
సోనీ టీవీలో వస్తున్న ‘ది కపిల్ శర్మ’ షోను, సిద్దూను బహిష్కరించాలని కొందరు పిలుపునిచ్చారు. ఈ షోను చూడకపోవడమే జవాన్లకు మనమిచ్చే అసలైన నివాళి అంటూ మరికొందరు అన్నారు. సోనీ టీవీకి ఏమాత్రం దేశభక్తి ఉన్నాఈ షో నుంచి సిద్దూను బహిష్కరించాలని చాలా మంది నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు.