telugu navyamedia
క్రీడలు వార్తలు

చివరి టీ20 కి నటరాజన్‌…?

ప్రస్తుతం భారత్-ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న టీ20 సిరీస్ లో రేపు చివరి మ్యాచ్ జరగనుంది. అయితే ఇప్పటి వరకు జరిగిన నాలుగు మ్యాచ్ లలో టీమిండియా లెఫ్టార్మ్ పేసర్ టీ నటరాజన్ ఆడలేదు. ఐపీఎల్ 2020 తర్వాత ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లి అన్ని ఫార్మాట్లలో అరంగేట్రం చేసి సత్తా చాటిన ఈ పేసర్.. విశ్రాంతి నేపథ్యంలో స్వదేశంలో ఇంగ్లండ్‌తో జరిగిన టెస్ట్ సిరీస్‌కు దూరమయ్యాడు. అనంతరం టీ20 సిరీస్‌కు ఎంపికైన నట్టూ.. ప్రాక్టీస్ లో అయిన గాయం కారణంగా నాలుగు మ్యాచ్‌లు ఆడలేకపోయాడు. అయితే ఇప్పటివరకు బెంగళూరులో నేషనల్ క్రికెట్ అకాడమీ లో చికిత్స తీసుకున్న నట్టూ పూర్తి స్థాయి ఫిట్‌నెస్ సాధించాడు. ఈ క్రమంలోనే బీసీసీఐ నిర్వహించిన అన్ని ఫిట్‌నెస్ టెస్ట్‌లను ప్లేయర్ క్లియర్ చేశాడు. దాంతో ఇంగ్లండ్‌తో జరిగే టీ20లో నటరాజన్ బరిలోకి దిగడం ఖాయంగా కనిపిస్తుంది. ఇప్పటికే జస్‌ప్రీత్ బుమ్రా లేక ఇబ్బంది పడుతున్న భారత జట్టుకు నట్టూ అవసరం చాలా ఉంది. అయితే గత మ్యాచ్ లో చాలా పరుగులు ఇచ్చేసిన సుందర్ స్థానంలో నటరాజన్ ను జట్టులోకి తీసుకోనున్నట్లు తెలుస్తుంది.

Related posts