telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

చంద్రబాబు హయాంలో మద్యం ఏరులై పారింది: రోజా

roja ycp mla

టీడీపీ అధినేతచంద్రబాబుపై వైసీపీ ఎమ్మెల్యే రోజా తీవ్ర విమర్శలు చేశారు. ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో ఆమె మాట్లాడుతూ చంద్రబాబుది ‘విజన్ 2020’ కాదు, ’విజన్ 420’ అని విమర్శించారు. గత ఐదేళ్లలో రూ.75 వేల కోట్ల మద్యం విక్రయాలు జరిగాయని అన్నారు. చంద్రబాబు హయాంలో మద్యం ఏరులై పారిందని విమర్శించారు. గ్రామ స్వరాజ్యం రావాలని, అర్ధరాత్రి ఆడపిల్ల స్వేచ్ఛగా తిరిగిన రోజునే స్వాతంత్ర్యం వచ్చినట్టు అని అన్నారు.

గ్రామాల్లో మద్యపానం ఉండకూడదన్న మహాత్ముడి ఆశయాల సాధన కోసం సీఎం పనిచేస్తున్నారని చెప్పారు. ఈ రాష్ట్రంలో బ్రాందీ పాలనకు సమాధి చేసి గాంధీ పాలనను తీసుకొచ్చిన ఏకైక ముఖ్యమంత్రి జగన్ అని కొనియాడారు. మద్యపాన నిషేధం అనేది పవిత్రమైన యజ్ఞం అని పేర్కొన్నారు. కేవలం ఆరు నెలల్లోనే 20 శాతం వైన్ షాపులను తగ్గించారని వివరించారు.

Related posts