ప్రధాని నరేంద్ర మోడీ 21 లక్షల తన స్వంత డబ్బు ను కుంభ మేళాలో పనిచేసిన పారిశుద్ద కార్మికుల సంక్షేమ నిధికి ఇచ్చారు . ఈ విషయాన్ని ప్రధమంత్రి కార్యాలయం ఈరోజు తెలియజేసింది . ప్రయాగరాజ్ రాష్ట్రంలో ఈ సంవత్సరం జరిగిన మహా కుంభ మేళాలో 24 కోట్లమంది భక్తులు పుణ్య స్థానాలు చేశారు .
50 రోజుల పాటు జరిగిన ఈ కుంభమేళాలో 1500 మంది పారిశుద్ద కార్మికులు విధులు నిర్వహించారు .ప్రధాని కుంభమేళాకు వెళ్లి పారిశుద్ద కార్మికుల పాదాలను స్వయంగా కడిగి సంచలనం సృష్టించారు . వారితో ప్రధాని కాసేపు ముచ్చటించారు . నిజంగా మీరంతా కర్మ యోగులని వారితో ప్రధాని చెప్పాడు . పరిశుద్ధ కార్మికుల సేవా గుణాన్ని ఆయన మెచ్చుకున్నారు . అందుకే వారి సంక్షేమం కోసం తన స్వంత డబ్బును మోడీ వారికి పంపిస్తున్నట్టు కార్యాలయం తెలిపింది . ప్రధాని నరేంద్ర మోడీ మానవతా గుణాన్ని ఎవరైనా ప్రశంసించాల్సిందే .
నా భార్య నైతిక విలువలున్న మనిషి: సిద్ధూ