సిల్లీ ఫెల్లోస్ అనే చిత్రంతో కాస్త తెలుగు ప్రేక్షకులకి దగ్గరైంది నందిని రాయ్. కానీ ఆమెకు తెలుగులో అంతగా గుర్తింపు రాలేదు. ఇక బుల్లితెర బిగ్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 2లో ఇలా మెరిసి అలా వెళ్లిన అందాల భామ నందిని రాయ్ ఇప్పుడు బాలీవుడ్ లో తన అదృష్టం పరీక్షించుకునేందుకు సిద్ధమైంది. దర్శకుడు హుస్సేన్ ఉత్తర ప్రదేశ్ బ్యాక్ డ్రాప్లో పొలిటికల్ డ్రామా తెరకెక్కిస్తున్నాడట. ఇందులో నందిని రాయ్ ముఖ్య పాత్ర పోషించనున్నట్టు తెలుస్తుంది. మరి హిందీలోనైన ఈ అమ్మడి కెరీర్ సాఫీగా సాగుతుందా అనేది చూడాలి. ఇప్పటికే టాలీవుడ్ నుంచి బాలీవుడ్ కు వెళ్లిన చాలామంది హీరోయిన్లు సరైన అక్కడ గ్లామర్ పోటీని తట్టుకోలేక చతికిలబడ్డారు. మరి ఈ బ్యూటీ ఏం చేస్తుందో చూడాలి.