telugu navyamedia
రాజకీయ వార్తలు సామాజిక

భారత్ సాయాన్ని మర్చిపోలేం.. మోదీని ప్రశంసిస్తూ ట్రంప్ ట్వీట్

modi trump

హైడ్రాక్సీ క్లోరోక్విన్ మాత్రల ఎగుమతులపై ఉన్న నిషేధాన్ని భారత్ ఎత్తివేయడంపై అమెరికా హర్షం వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్‌కు ధన్యవాదాలు చెబుతూ ట్వీట్ చేశారు. అసాధారణ సమయాల్లో స్నేహితుల మధ్య పరస్పర సహకారం అవసరమని ట్రంప్ వ్యాఖ్యానించారు.

హైడ్రాక్సీ క్లోరోక్విన్ మాత్రల ఎగుమతులపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేసినందుకు భారత్ కు కృతజ్ఞతలు తెలిపారు. భారత్ చేసిన సాయాన్ని మర్చిపోలేమని, కరోనాపై పోరాటంలో మీ బలమైన నాయకత్వానికి, మానవత్వానికి ధన్యావాదాలు తెలుపుకుంటున్నట్టు ట్రంప్ ఆ ట్వీట్‌లో పేర్కొన్నారు.

ఇటీవల మోదీకి ఫోన్ చేసిన ట్రంప్ తమకు హైడ్రాక్సీ క్లోరోక్విన్ మాత్రలు కావాలని కోరారు. ఆయన అభ్యర్థనకు స్పందించిన భారత ప్రభుత్వం హైడ్రాక్సీ క్లోరోక్విన్‌తోపాటు మరికొన్ని ఔషధాల ఎగుమతులపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేసింది. భారత్ తీసుకున్న ఈ నిర్ణయంపై హర్షం వ్యక్తం చేస్తూ ట్రంప్ ఈ ట్వీట్ చేశారు.

Related posts