telugu navyamedia
క్రైమ్ వార్తలు వార్తలు సామాజిక

ఏపీకి చెందిన తబ్లిగీ సభ్యులపై యూపీలో కేసు

corona pakistan

ఇటీవల ఢిల్లీలో జరిగిన మార్కజ్ సదస్సుకు ఆంధ్రప్రదేశ్‌కు చెందిన తబ్లిగీ జమాత్ సభ్యులు హాజరయ్యారు. వీరంతా తిరిగి ఏపీకి రాకుండా ఉత్తరప్రదేశ్‌లో తలదాచుకున్నారు. యూపీలో భవార్సీలోని శాంగిబెగ్ ప్రాంతానికి చెందిన 50 ఏళ్ల వ్యక్తి వీరికి ఆశ్రయమిచ్చినట్టు తేలింది.

ఆశ్రయమిచ్చిన వ్యక్తికి కరోనా సోకినట్టు నిర్ధారణ కావడంతో అప్రమత్తమైన పోలీసులు ఆ ప్రాంతం మొత్తాన్ని దిగ్బంధించారు. ఆసమయంలో ఏపీకి చెందిన 10 మందిని అదుపులోకి తీసుకున్న పోలీసులు వారిపై అంటువ్యాధుల నిరోధక చట్టం, విపత్తు నిర్వహణ చట్టం కింద కేసులు నమోదు చేశారు. వారి నుంచి నమూనాలు సేకరించి పరీక్షల కోసం పంపించారు.

Related posts