telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

రాజకీయ పబ్బంకోసం చంద్రబాబు డ్రామాలు: మంత్రి అనిల్ కుమార్

minister anil kumar

మాజీ సీఎం చంద్రబాబుపై ఏపీ మంత్రి అనిల్ కుమార్ విరుచుకుపడ్డారు. చంద్రబాబు ఇంటిపై డ్రోన్ వ్యవహారం పై మంత్రి మీడియాతో మాట్లాడుతూ రాజకీయ పబ్బంకోసం చంద్రబాబు డ్రామాలాడుతున్నారని ధ్వజమెత్తారు. చంద్రబాబు ఇల్లు ముంపు ప్రాంతంలో ఉందని, ఇంటిని ఖాళీ చేయాలని ఎప్పుడో చెప్పామని గుర్తుచేశారు. ఇరిగేషన్ శాఖ ఆదేశాలతోనే మూడు రోజులుగా డ్రోన్లను వినియోగిస్తున్నామని చెప్పారు.

కరకట్ట వెంబడి కొన్ని ప్రాంతాలు ముంపునకు గురయ్యాయని, కరకట్ట ప్రాంతాల్లోని ప్రజల రక్షణ ప్రభుత్వం బాధ్యత అని మంత్రి స్పష్టం చేశారు. ల్లు మునిగిపోతుందన్న విషయం బయటపడకుండా చంద్రబాబు ఆరాటపడుతున్నారని విమర్శించారు. చంద్రబాబు ఇంట్లోకి నీళ్లు రాకుండా బస్తాలు వేసి అష్టకష్టాలు పడుతున్నారని మంత్రి అనిల్ ఎద్దేవా చేశారు. జగన్ సీఎం అయిన రెండు నెలల్లోనే ప్రాజెక్టులన్నీ నిండాయని పేర్కొన్నారు. ప్రాజెక్టుల్లో నీరు నిండటం టీడీపీ నేతలకు ఏమాత్రం ఇష్టం లేదన్నారు.

Related posts