వచ్చే సంవత్సరం జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో క్లీన్స్వీప్ చేయాలని ఆప్ అధినేత, డిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఈ రోజు కేజ్రీవాల్ పుట్టిన రోజు సందర్భంగా శుభాకాంక్షలు చెప్పేందుకు వచ్చిన పార్టీ కార్యకర్తలతో ఆయన మాట్లాడుతూ ఆప్(ఆమ్ ఆద్మీ పార్టీ) అన్ని సీట్లు గెలుచుకుంటుందని ఆశాభావం వక్తం చేశారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో 70 స్థానాలకు గాను 67 స్థానాలు గెలుచుకున్న ఆప్.. ఈసారి క్లీన్స్వీప్ చేయాలని పార్టీ శ్రేణులకు సూచించారు.
కేజ్రీవాల్ పుట్టిన రోజు సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ శుభాకాంక్షలు చెప్పారు. మీరు ఆయురారోగ్యాలతో చిరకాలం జీవించాలని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. అదేవిధంగా, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, ఢిల్లీ బీజేపీ నాయకులు విజేందర్ గుప్తా, జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ మరియు పలువురు సినీ ప్రముఖులు ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పారు. వారందరికీ ఈ సందర్భంగా ఆయన ధన్యవాదాలు తెలిపారు.
అందుకే వారు టీఆర్ఎస్ని ఓడించారు: విజయశాంతి