ఎన్నో వివాదాల నడుమ మొదలైంది బిగ్ బాస్ సీజన్ 3. కింగ్ నాగార్జున హోస్ట్గా మొదలైన ఈ షో 100 రోజులపాటు 15 మంది కంటెస్టెంట్తో బుల్లితెర ప్రేక్షకులను అలరించనుంది. షో మొదలైన రెండ్రోజులకే హౌజ్ మేట్స్ మధ్య గొడవలు మొదలయ్యాయి. ఇంట్లో రోజురోజుకీ రచ్చ పెరిగిపోతుంది. ఫుడ్ దగ్గర మొదలైన చిన్న గొడవ ఇప్పుడు చిలికి చిలికి గాలివానలా మారిపోతుంది. దానికి తోడు విడుదలవుతున్న ప్రోమోలు కూడా మరింత ఆసక్తి పెంచేస్తున్నాయి. ఇప్పుడు విడుదలైన ఐదో రోజు ప్రోమో అదిరిపోయింది. సగం చపాతి దగ్గర మొదలైన వార్ కాస్తా ఇప్పుడు మరీ కొట్టుకునే స్థాయికి వెళ్లిపోవడం… ఒకరినొకరు అరుచుకోవడం కూడా చేసారు కంటెస్టెంట్లు. దీనంతటికి కారణమైన హేమ మాత్రం సైలెంట్ అయిపోవడంతో జాఫర్ ఈ గొడవకు ఫుల్ స్టాప్ పెట్టడానికి మీరే వివరణ ఇవ్వాలని కోరాడు. దాంతో “నాగార్జున వస్తాడు కదా… అప్పుడు మాట్లాడదాం” అంటూ చెప్పేసింది హేమ. వెంటనే స్పందించిన మహేష్ విట్టా “నాగార్జున గారి రేంజ్ ఏంది.. మన పత్తి యాపారం ఏంది అంటూ సీమ మార్క్ డైలాగ్ వదిలాడు. దాంతో ఒక్కసారిగా అప్పటి వరకు వార్ వాతావరణం కాస్తా నవ్వులతో మునిగిపోయింది. రానున్న రోజుల్లో ఇంకా ఎలా ఉంటుందో చూడాలి మరి.
previous post
తిని కూర్చొని బరువు పెరగడం లేదు : నిత్యామీనన్