మెగాస్టార్ చిరంజీవి హీరోగా “ఆచార్య” చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. రంజీవి సరసన కాజల్ అగర్వాల్ నటిస్తున్న ఈ చిత్రాన్ని సక్సెస్ఫుల్ చిత్రాల దర్శకుడు కొరటాల శివ రూపొందిస్తున్నారు. కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్స్పై రామ్ చరణ్, నిరంజన్రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మెలోడీ బ్రహ్మ మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. పుట్టినరోజు కానుకగా ప్రస్తుతం ఆయన నటిస్తున్న ‘ఆచార్య’ చిత్రం నుంచి మోషన్ పోస్టర్ను విడుదల చేసిన విషయం తెలిసిందే. మెసేజ్ ఓరియంటెడ్ సినిమాగా ఈ చిత్రం తెరకెక్కినట్లుగా ఈ మోషన్ పోస్టర్ చూస్తుంటే తెలుస్తోంది. ఈ చిత్రాన్ని సమ్మర్ 2021కి విడుదల చేయబోతున్నట్లుగా చిత్రయూనిట్ మోషన్ పోస్టర్లో ప్రకటించింది. ప్రస్తుతం ఈ మోషన్ పోస్టర్ వీడియో యూట్యూబ్ ఇండియా ట్రెండింగ్లో టాప్ ప్లేస్లో ఉంది.
previous post