టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్బాబు లాక్డౌన్ కాలంలో సోషల్మీడియాలో యాక్టివ్గా ఉంటోన్న విషయం తెలిసిందే. మహేశ్ హోంక్వారంటైన్ సమయాన్ని తన కుటుంబంతో కలిసి ఎంజాయ్ చేస్తున్నాడు. అయితే మహేశ్ సెల్ఫీ ఒకటి నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. తన కూతురు సితారతో కలిసి ఓ సెల్ఫీ దిగాడు. మహేశ్, సితార సెల్ఫీ అద్దంలో ప్రతిబింబిస్తోంది. ఈ సెల్ఫీ ప్రత్యేకత ఏంటంటే చాలా రోజుల తరువాత మహేశ్ చాలా కొత్తగా యంగ్ లుక్లో కనిపిస్తున్నాడు. ఈ స్టిల్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇక మహేశ్ సినిమాల విషయానికొస్తే… మహేష్ బాబు ఈ ఏడాది “సరిలేరు నీకెవ్వరు” చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ చిత్రం మంచి విజయం సాధించింది. అనీల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం అభిమానులని అలరించింది. త్వరలో పరశురాం దర్శకత్వంలో మహేష్ ఓ చిత్రం చేయనున్నారు. మహేష్ - పరశురాం కాంబినేషన్లో రూపొందనున్న చిత్రం అతి త్వరలో సెట్స్ పైకి వెళ్ళనుంది.
previous post