telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

మహేష్ బాబుకు అలాంటి చిత్రంలో నటించాలని ఉందట…

mahesh

‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాతో ఈ యేడాది మహేష్ బాబు మంచి సక్సెస్ అందుకున్నాడు. పరుశురామ్‌తో నెక్ట్స్ మూవీ చేయడానికి రెడీ అవుతన్నాడు. దీని తరువాత రాజమౌళితో తదుపరి ప్రాజెక్ట్ ఉంటుంది. అయితే మహేష్ బాబుకు ఒక కోరిక ఉందట. అదేమంటే అక్కినేని ఫ్యామిలీ హీరోలందరు కలిసి నటించిన సినిమా ‘మనం’. ఢిఫరెంట్ కాన్సెప్ట్‌తో తెరకెక్కిన ‘మనం’ చిత్రంలో అక్కినేని మూడు తరాల హీరోలైన అక్కినేని నాగేశ్వర రావు, నాగార్జున, నాగ చైతన్య, చివర్లో అఖిల్ ఈ సినిమాలో ఒకే స్క్రీన్‌లోకనిపించి అభిమానులకు కనువిందు చేసారు. ముందుగా అనుకోకపోయినా.. అక్కినేని వాళ్లింటి కోడలైన సమంత కూడా ‘మనం’ చిత్రంలో అక్కినేని హీరోలతో కలిసి నటించిడం యాదృచ్చికమనే చెప్పాలి. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్టైయింది. తాజాగా మహేష్ బాబు కూడా తండ్రి సూపర్ స్టార్‌ కృష్ణతో పాటు కొడుకు గౌతమ్ కృష్ణతో ఇలాంటి సబ్జెక్ట్‌తో ఓ సినిమా చేయాలనే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం. ఇప్పటికే దానికి సంబంధించిన కథ ఉంటే రెడీ చేయమని దర్శకులకు చెప్పినట్టు ఫిల్మ్ నగర్ వర్గాల సమాచారం. ఇలాంటి చిత్రం మహేష్ కూడా తీస్తే అభిమానులకు పండగే మరి.

Related posts