లాక్ డౌన్ నిబంధనలు ఉల్లంఘిస్తూ బయటకు వచ్చిన వారి నుంచి పోలీసులు, వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. ఇప్పుడు వాహనదారులకు ఉపశమనం కలిగించే నిర్ణయం తీసుకున్నారు. కోర్టుకు వెళ్లకుండానే ఆన్ లైన్ లో ఈ-కోర్టు ద్వారా కేసులను పరిష్కరించేందుకు ప్రణాళికలు రూపొందించారు.
జంట నగరాల పరిధిలోని హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ పరిధిలో ప్రస్తుతం పోలీసుల వద్ద లాక్ డౌన్ నిబంధనలను ఉల్లంఘించిన సుమారు 3.25 లక్షల వాహనాలుఉన్నాయి. వీటిని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పరిష్కరించాలని కోర్టులను పోలీసులు కోరారు. కోర్టుల నుంచి అనుమతి రాగానే, వాహనాలను, నిందితులను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రవేశపెట్టేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్టు పోలీసు ఉన్నతాధికారులు వెల్లడించారు.