2005లో విడుదలైన “చంద్రముఖి” దక్షిణాది ప్రేక్షకులని ఎంతగానో అలరించింది. ఈ చిత్రంలో రజనీకాంత్, నయనతార, జ్యోతిక ముఖ్య పాత్రలు పోషించారు. ముఖ్యంగా చిత్రంలో జ్యోతిక నటన ప్రేక్షకులు ఎంతగానో ఫిదా అయ్యారు. గంగ పాత్రలోను, చంద్రముఖిగాను జ్యోతిక తన నట విశ్వరూపం చూపించి అభిమానులను మెప్పించింది. కొద్ది రోజుల క్రితం “చంద్రముఖి” సినిమాకు సీక్వెల్ రాబోతోంది అనే విషయాన్ని స్యయంగా దర్శకుడు, హీరో అయిన రాఘవ లారెన్స్ ప్రకటించాడు. కాగా “చంద్రముఖి”లో నటించిన జోతిక ఈ సీక్వెల్ లో నటిస్తుందా ? అనే అనే విషయం తెలియాల్సి ఉండగా… తాజాగా దీనిపై స్పందించింది జ్యోతిక. ఈ ప్రాజెక్ట్ గురించి తనను ఎవరు సంప్రదించలేదని, “చంద్రముఖి-2” గురించే తనకి తెలియదని జ్యోతిక చెప్పుకొచ్చింది. ఇదిలా ఉంటే జోతిక నటించిన ‘పొన్మగళ్ వందాళ్’అనే చిత్రం త్వరలో ఓటీటీలో విడుదల కానున్న విషయం తెలిసిందే.
previous post
next post