ట్రాఫిక్ అధికారులు అన్నాక ఫైన్ లు వేయకుండా ఉండరు.. ప్రయాణికులన్నాక కట్టక మానరు.. కానీ అదే ఒక లైన్మేన్ కి జరిగితే, ప్రతీకారమే. ద్విచక్రవాహనం నడిపే సమయంలో హెల్మెట్ ధరించక పోవడంతో ఓ కరెంట్ లైన్మేన్కు ట్రాఫిక్ ఎస్.ఐ రూ.500 అపరాధం విధించాడు. దీంతో చిర్రెత్తిపోయిన ఆ లైన్మ్యాన్…. కరెంట్ బిల్లు కట్టడం లేదన్న సాకుతో ఠాణాకు విద్యుత్ సరఫరా నిలిపివేసి ప్రతిచర్య తీసుకున్నాడు. ఆగ్రాలోని లీనాపూర్ పోలీస్ స్టేషన్ పరిధికి చెందిన శ్రీనివాస్ అనే వ్యక్తి స్థానిక విద్యుత్ బోర్డులో లైన్మేన్గా పని చేస్తున్నాడు. అయితే, ఈయన డ్రైవింగ్ చేసే సమయంలో హెల్మెట్ ధరించలేదు.
దీన్ని గమనించిన లీనాపూర్ ఎస్.ఐ. రమేష్ చంద్ర రూ.500 అపరాధం విధిస్తూ చలానా రాశాడు. ఆ తర్వాత హెల్మెట్, ట్రాఫిక్ రూల్స్ గురించి శ్రీనివాస్కు ఎస్.ఐ వివరించాడు. ఈ చర్యతో కోపోద్రిక్తుడైన శ్రీనివాస్ విద్యుత్ సబ్ స్టేషన్కు వెళ్లి పోలీస్ స్టేషన్కు కరెంట్ సరఫరా చేసే లైన్ను కత్తిరించాడు. ఈ విషయం తెలియని పోలీసులు.. విద్యుత్ సబ్ స్టేషన్కు ఫోన్ చేయగా… పోలీస్ స్టేషన్కు సంబంధించి రూ.6.6 లక్షల కరెంట్ బిల్లు పెండింగ్లో ఉందనీ అందుకే కరెంట్ కట్ చేసినట్టు వివరణ ఇచ్చాడు. పైగా, మొత్తం బిల్లు చెల్లిస్తేనే కరెంట్ సరఫరాను పునరుద్ధరిస్తామని భీష్మించికూర్చున్నాడు. దీంతో మొత్తం విద్యుత్ బిల్లును చెల్లించే పనిలో నిమగ్నమయ్యారు.
ప్రభాస్ నా కొడుకు… అనుష్క కామెంట్స్ వైరల్