telugu navyamedia
ఆరోగ్యం ట్రెండింగ్

ఉపవాసం ఉన్నప్పుడు ఖర్జూరాలు ఎందుకు తినాలంటే ?

Khajor

ఖర్జూర పండు ఆరోగ్యప్రయోజనాలు కూడా అందరికీ తెలిసినవే. ఎన్నో పోషకాలే కాకుండా ఇందులో కాల్షియం, ఐరన్, ఫాస్ఫరస్, పొటాషియం, మెగ్నీషియం, జింక్ ఉన్నాయి. ఖర్జూరాల్లో కొలెస్ట్రాల్ అసలు లేకపోవడమే కాదు, కొవ్వు కూడా చాలా తక్కువగా ఉంటుంది. కాబట్టి స్నాక్స్ గా ఖర్జూరాలు తీసుకోడం అలవాటు చేసుకోండి. బీ1, బీ2, బీ3, బీ5, ఏ1, సీ విటమిన్స్ ఖర్జూరాలలో సమృద్ధిగా ఉన్నాయి. కాబట్టి ఖర్జూరాల్ని మీ ఆహారంలో భాగం చేసుకుంటే ఎలాంటి విటమిన్ సప్లిమెంట్స్ తీసుకోవాల్సిన అవసరం ఉండదు. వీటి వల్ల మీ ఎనెర్జీ లెవెల్స్ కూడా బాగా పెరుగుతాయి. కాబట్టి చాలా మంది ఉపవాసం ఉన్నప్పుడు కూడా వీటిని తీసుకుంటారు. వీటిని తీసుకోవడం వల్ల నీరసం త్వరగా తగ్గుతుంది. ఖర్జూరాలలో సెలీనియం, మాంగనీస్, కాపర్, మెగ్నీషియం పుష్కలంగా ఉన్నాయి. ఇవి ఎముకలకి బలాన్నివడమే కాకుండా ఆస్టియోపొరాసిస్ రాకుండా చేస్తాయి. అరుగుదల సమస్యలేమైనా ఉంటే ఖర్జూరాలని నీటిలో నానబెట్టి రోజూ తీసుకోవడం చాలా మంచిది. మలబద్ధకం సమస్యకు కూడా ఇది చక్కటి పరిష్కారం. ఖర్జూరాలలో ఉండే సీ, డీ విటమిన్స్ చర్మాన్ని మృదువుగా ఉంచడమే కాకుండా చర్మం యొక్క సాగే గుణాన్ని కూడా పెంచుతాయి. ఇంకా, మెలనిన్ పేరుకోకుండా చేసి, వయసు కనిపించకుండా చేస్తాయి. ఖర్జూరాలు తీసుకోవడం వల్ల మీ ఆరోగ్య సమస్యలు మాత్రమే కాదు.. అందానికి కూడా పనికొస్తాయి. చర్మం మెరుస్తుంది. జుట్టు సమస్యలు చాలా వరకూ దూరం అవుతాయి. అదే విధంగా చక్కెర ఎన్నో సమస్యలకు దారి తీస్తుంది. అందుకే చక్కెర వాడకాన్ని తగ్గించాలి. దానికి బదులుగా మీరు ఖర్జూరాలని వాడుకోవచ్చు. ఖర్జూరాలని నానబెట్టి ఆ నీటిని కలుపుకోవడం వల్ల వంటకాలకి చక్కెర ఇచ్చే రుచి వస్తుంది. ఇది ఎంతో మేలు చేస్తుంది. పాయసం, లడ్డూలు, జ్యూస్‌లు, స్మూతీస్ ఇలా ఏవైనా సరే చక్కెర వాడే ఆహార పదార్థాల్లో ఖర్జూరాలని వాడి చూడండి. వీటి వల్ల రుచి కూడా బావుంటుంది.

Related posts