తనను లైంగికంగా వేధిస్తోందంటూ ఆమె అనుచరుడు కోటి వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి లక్ష్మీపార్వతి పై ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారం పై లక్ష్మీపార్వతి స్పందించారు. తనపై లేనిపోనివి కల్పించి దుష్ప్రచారం చేస్తున్నారని ఆమె వ్యక్తం చేశారు. వైసీపీ తరఫున తాను ఎన్నికల ప్రచారంలో విస్తృతంగా పాల్గొంటున్నాననే అక్కసుతో చంద్రబాబు కుటుంబీకులు ఇలాంటి అసత్య ప్రచారం చేస్తున్నారని దుయ్యబట్టారు. గతంలో తన అభిమానిగా ఉన్న కోటి అనే వ్యక్తిని బెదిరించి, దుర్మార్గమైన వ్యాఖ్యలు చేయించారని వాపోయారు. ఇటువంటి చర్యలు చంద్రబాబు దిగజారుడు తనానికి నిదర్శనమని లక్ష్మీ పార్వతి వ్యాఖ్యానించారు.
కేసీఆర్ రాజ్యాంగ విరుద్ధంగా ప్రవర్తిస్తున్నారు: భట్టి విక్రమార్క