మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ నటించిన డెబ్యూ సినిమా ‘ఉప్పెన’. కృతిశెట్టి హీరోయిన్ గా టాలీవుడ్ కి పరిచయం అవుతోంది. సుకుమార్ అసోసియేట్ బుచ్చిబాబు ఈ సినిమాతో దర్శకుడిగా టాలీవుడ్ కి పరిచయం అవుతున్నాడు. ఇక సుకుమార్, మైత్రీ మూవీ మేకర్స్ కలిసి ఈ సినిమా నిర్మించిన సంగతి తెలిసిందే. ఇటీవలే ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. ఈ సందర్భంగా చిరంజీవి కృతిని తెగ పొగిడేశాడు. ఈ నేపథ్యంలో కృతికి వరుస ఆఫర్లు క్యూ కడుతున్నాయి. ప్రస్తుతం ఆమె నాని శ్యామ్ సింగరాయ్ సినిమాలో ఒక కథానాయికగా నటిస్తోంది. అలాగే సుధీర్బాబు-మోహన్కృష్ణ ఇంద్రగంటి కాంబినేషన్లో తెరకెక్కనున్న సినిమాలో కూడా కథానాయికగా ఎంపికైంది. అలాగే మరికొన్ని సినిమాలు చర్చల దశలో ఉన్నాయి. దీంతో కృతి తొలి సినిమా రిలీజ్ కాకముందే రూ. 50 లక్షల పారితోషికం డిమాండ్ చేస్తున్నట్లు టాక్ నడుస్తోంది.
previous post
next post