telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

ట్రెండ్ సెట్ చేస్తున్న `ఉప్పెన` భామ కృతి !

మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ నటించిన డెబ్యూ సినిమా ‘ఉప్పెన’. కృతిశెట్టి హీరోయిన్ గా టాలీవుడ్ కి పరిచయం అవుతోంది. సుకుమార్ అసోసియేట్ బుచ్చిబాబు ఈ సినిమాతో దర్శకుడిగా టాలీవుడ్ కి పరిచయం అవుతున్నాడు. ఇక సుకుమార్, మైత్రీ మూవీ మేకర్స్ కలిసి ఈ సినిమా నిర్మించిన సంగతి తెలిసిందే.  ఇటీవలే ఈ మూవీ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ జరిగింది. ఈ సందర్భంగా చిరంజీవి కృతిని తెగ పొగిడేశాడు.  ఈ నేపథ్యంలో కృతికి వరుస ఆఫర్లు క్యూ కడుతున్నాయి. ప్రస్తుతం ఆమె నాని శ్యామ్‌ సింగరాయ్‌ సినిమాలో ఒక కథానాయికగా నటిస్తోంది. అలాగే సుధీర్‌బాబు-మోహన్‌కృష్ణ ఇంద్రగంటి కాంబినేషన్‌లో తెరకెక్కనున్న సినిమాలో కూడా కథానాయికగా ఎంపికైంది. అలాగే మరికొన్ని సినిమాలు చర్చల దశలో ఉన్నాయి. దీంతో కృతి తొలి సినిమా రిలీజ్‌ కాకముందే రూ. 50 లక్షల పారితోషికం డిమాండ్‌ చేస్తున్నట్లు టాక్‌ నడుస్తోంది.

Related posts