మాజీ స్పీకర్ ఓవైపు కోడెల శివప్రసాదరావు నిన్న హైదరాబాద్ లో ఆత్మహత్యకు పాల్పడ్డ సంగతి తెలిసిందే. రేపు ఆయన అంత్యక్రియలు నరసరావుపేటలో జరుగనున్నాయి. ఈ క్రమంలో అంత్యక్రియలపై ఆంక్షలు పెట్టడంతో టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు వైసీపీ నేతలపై మండిపడ్డారు.
మరోవైపు అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు అంటూ నాటకాలు ఆడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కోడెలను అభిమానులు కడసారి చూసే వీల్లేకుండా నరసరావుపేట పోలీస్ సబ్ డివిజన్ పరిధిలో 144 సెక్షన్ విధించారని, 30 పోలీస్ యాక్ట్ తీసుకువచ్చారని ఆరోపించారు. తమ దుశ్చర్యలను దాచిపెట్టుకోవడానికే ఈ విధంగా వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు. ఎంత అసత్య ప్రచారం చేసినా ప్రజలకు ఈ సర్కారు నిజస్వరూపం తెలిసిందని ట్వీట్ చేశారు.