telugu navyamedia
క్రీడలు వార్తలు

ఐపీఎల్ 2020 : కేకేఆర్ కు ముందే షాక్ ఇచ్చిన పంజాబ్…

ఐపీఎల్ 2020 లో ఈ రోజు అబుదాబి వేదికగా కింగ్స్ ఎలెవన్ పంజాబ్- కోల్‌కత నైట్ రైడర్స్ జరుగుతుంది. అయితే ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన కేకేఆర్ కెప్టెన్ దినేష్ కార్తీక్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఇక బ్యాటింగ్ కు వచ్చిన కేకేఆర్ కు ముందే షాక్ ఇచ్చింది పంజాబ్. కేవలం 4 ఓవర్లలోనే ఆ జట్టు ముఖ్య ఆటగాళ్లు అయిన రాహుల్ త్రిపాఠి (4), నితీష్ రానా(2) లను పెవిలియన్ కు చేర్చారు పంజాబ్ బౌలర్లు. ప్రస్తుతం 8 ఓవర్లు ముగిసే సమయానికి కోల్‌కత 2 వికెట్ల నష్టానికి 45 పరుగులు చేసింది. శుబ్మాన్ గిల్ (21) ఇయాన్ మోర్గాన్ (14) బ్యాటింగ్ చేస్తున్నారు.

పంజాబ్ జట్టు : కేఎల్ రాహుల్ (c/w), మయాంక్ అగర్వాల్, మన్‌దీప్ సింగ్, నికోలస్ పూరన్, సిమ్రాన్ సింగ్, గ్లెన్ మాక్స్వెల్, ముజీబ్ ఉర్ రెహ్మాన్, క్రిస్ జోర్డాన్, రవి బిష్ణోయ్, మహ్మద్ షమీ, అర్ష్‌దీప్ సింగ్

కోల్‌కత జట్టు : రాహుల్ త్రిపాఠి, శుబ్మాన్ గిల్, నితీష్ రానా, సునీల్ నరైన్, ఇయాన్ మోర్గాన్, ఆండ్రీ రస్సెల్, దినేష్ కార్తీక్ (c/w), పాట్ కమ్మిన్స్, కమలేష్ నాగర్‌కోటి, ప్రసిద్ కృష్ణ, వరుణ్ చక్రవర్తి

Related posts