టాలీవుడ్ చందమామ కాజల్ బాలీవుడ్ సూపర్ హిట్ మూవీ “క్వీన్” తమిళ రీమేక్ “పారిస్ పారిస్”లో నటించిన సంగతి తెలిసిందే. చిత్ర షూటింగ్ చాన్నాళ్ళ క్రితమే పూర్తికాగా, ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. అయితే కాజల్ నటించిన “పారిస్ పారిస్” చిత్రం ఇటీవలే సెన్సార్కి వెళ్లగా, సెన్సార్ సభ్యులు దీనిపై అభ్యంతరం వ్యక్తం చేశారు. బూతు పదాలు, బోల్డ్ విజువల్స్ ఉండడంతో వాటిని తొలగించడంతో పాటు కొన్నింటిన బ్లర్ చేయాలని చిత్ర యూనిట్కి సీబీఎఫ్సీ సూచించిందట. మెడియంటే ఫిలింస్ బేనర్పై మను కుమారన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. “క్వీన్” చిత్రం సౌత్ లోని నాలుగు భాషలలో రీమేక్ కాగా, హిందీలో కంగనా రనౌత్ పోషించిన పాత్రని తెలుగులో తమన్నా, తమిళంలో కాజల్, మలయాళంలో మంజిమా మోహన్, కన్నడలో పరుల్ యాదవ్ లు పోషించారు. “క్వీన్” రీమేక్ చిత్రం కన్నడలో “బటర్ ఫ్లై” అనే టైటిల్తో తెరకెక్కుతుండగా, తమిళంలో “పారిస్ పారిస్”, మలయాళంలో “జామ్ జామ్”, తెలుగులో “దటీజ్ మహాలక్ష్మీ” అనే టైటిల్స్ తో రూపొందుంది. తెలుగు వర్షెన్ని అ చిత్ర ఫేం ప్రశాంత్ వర్మ డైరెక్ట్ చేయగా, కన్నడ వర్షెన్ని రమేష్ అరవింద్, తమిళ వర్షెన్ని కూడా రమేష్ అరవింద, మలయాళ వర్షెన్ని నీలకంఠ తెరకెక్కించారు.
ఇందులో కాజల్ ఛాతిపై అమ్మాయి చేయి వేసి నొక్కుతున్న దృశ్యాన్ని కూడా అలాగే ఉంచేసారు. కాజల్ గుండెను ఎలీ అవరామ్ ముట్టుకునే సీన్ సంచలనంగా మారింది. ఇక టీజర్ ఇలా ఉంటే సినిమా ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు. సినిమాలో ఇలాంటివి చాలా సన్నివేశాలు ఉండటంతో మరో మాట లేకుండా కత్తెరించేసింది సెన్సార్ బోర్డ్. ఆడియన్స్ ఈ సినిమా కోసం బాగానే వెయిట్ చేస్తున్నా.. సెన్సార్ బోర్డ్ మాత్రం ఒప్పుకోవడం లేదు. ‘ప్యారిస్ ప్యారిస్’లో బోలెడు బోల్డ్ సన్నివేశాలు ఉండటంతో కత్తెర వేయక తప్పలేదు. ఇప్పుడు దీనిపై కాజల్ కూడా స్పందించింది. ఒరిజినల్ సినిమాలో ఏమున్నాయో అవే ఇక్కడ కూడా తీసాం.. నేను కూడా కష్టపడి చేసాను.. ఇలా కత్తిరించడం నాకేమాత్రం నచ్చలేదు అంటూ సెన్సార్ బోర్డుపై అసహనం వ్యక్తం చేసింది కాజల్ అగర్వాల్. సినిమా మొత్తమ్మీద ఒకటి రెండు కాదు.. 25 కట్స్ చెప్పారని తెలుస్తుంది.