ప్రజాశాంతి పార్టీ అధినేత, క్రైస్తవ మత ప్రచారకుడు కేఏ పాల్ ఈ ఎన్నికల్లో ఆంద్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా తమ అభ్యర్థులను బరిలోకి దింపారు. నర్సాపురం లోక్సభ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన పాల్ కు గడ్డు పరిస్తితి ఎద్దురైంది. ఆయన పోటీ చేసిన నియోజకవర్గంలో వైసీపీ ఆధిక్యంలో దూసుకుపోతోంది. కనుమూరు రఘురామ కృష్ణంరాజు లీడ్లో ఉన్నారు. రెండో స్థానంలో టీడీపీ, మూడో స్థానంలో జనసేన పార్టీ ఉన్నాయి.
ఎన్నికల సంఘం అధికారిక వెబ్ సైట్లో నమోదు చేసిన లెక్కల ప్రకారం.. ఇదే నియోజకవర్గం నుంచి పోటీ చేసిన ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ చాలా తక్కువ ఓట్లు మాత్రమే పడ్డాయి. మధ్యాహ్నం వరకు కేవలం 407 ఓట్లు పడ్డాయి. దీంతో కేఏ పాల్ చివరకు తాను పోటీ చేసిన నరసాపురం లోక్సభ స్థానంలో డిపాజిట్ కూడా దక్కించుకోకుండా పరువు పోగొట్టుకునే పరిస్థితి నెలకొంది.