75 శాతం ఉద్యోగాలు స్థానికులకే ఇవ్వాలని ఏపీ ప్రభుత్వం చట్టం చేసిన సంగతి తెలిసిందే. తాజాగా అదే బాటలోనే కర్ణాటక ప్రభుత్వం నడుస్తోంది. కర్ణాటకలో మెజారిటీ ఉద్యోగాలు కన్నడిగులకే దక్కాలని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్ప వ్యాఖ్యానించారు. ఇందుకు అనుగుణంగా తాము చర్యలు తీసుకోబోతున్నామని చెప్పారు.
ఈ మేరకు ట్విట్టర్ లో యడియూరప్ప స్పందించారు. కర్ణాటకలోని ఉద్యోగాలు కన్నడిగులకే అనే హ్యాష్ ట్యాగ్ ను తన ట్వీట్ కు జతచేశారు.క్షేత్రస్థాయిలో ప్రజల అభిప్రాయాన్ని ఎల్లప్పుడూ మేం పరిగణనలోకి తీసుకుంటాం. ప్రజల అభిప్రాయానికి అనుగుణంగా ముందుకు పోతామని యడియూరప్ప ట్విట్టర్ లో పేర్కొన్నారు.
చంద్రబాబు నోరు తెరిస్తే అన్నీ అబద్ధాలు: సీఎం జగన్