telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

చంద్రబాబు నోరు తెరిస్తే అన్నీ అబద్ధాలు: సీఎం జగన్‌

ఏపీ అసెంబ్లీ సమావేశాలు వాడివేడిగా జరుగుతున్నాయి. అధికార, విపక్ష నేతల మధ్య మాటల యుద్దం జరుగుతుంది. గత ఐదేళ్లలో రైతులకు సున్నా వడ్డీకి చంద్రబాబు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని సీఎం జగన్‌ ఆరోపించారు. అసెంబ్లీలో కరవుపై చర్చ సందర్భంగా టీడీపీ ఎమ్మెల్యే రామానాయుడు మాట్లాడుతూ 2014-17 వరకు సున్నా వడ్డీ పథకం అమలు చేశామన్నారు.

అలాగే 2017-19 వరకు రూ.570 కోట్లు మాత్రమే బకాయిలు ఉన్నాయని చెప్పారు. సున్నా వడ్డీపై అధికార ప్రతిపక్ష సభ్యుల మధ్య సంవాదం చోటుచేసుకుంది. చంద్రబాబు నోరు తెరిస్తే అబద్ధాలు మాట్లాడుతున్నారని సీఎం జగన్‌ ధ్వజమెత్తారు. రికార్డులు తెప్పిస్తా.. రాజీనామా చేస్తారా? అని వ్యాఖ్యానించారు. కేటాయింపుల్లో రూ.172 కోట్లు కనిపిస్తాయి.. కానీ ఖర్చు సున్నా అన్నారు. రైతులను పట్టించుకోలేదు కాబట్టే విపక్షంలో కూర్చున్నారంటూ టీడీపీని ఉద్దేశించి జగన్ దుయ్యబట్టారు.

Related posts