ఝార్ఖండ్ ముక్తి మోర్చా (జేఎంఎం) ర్యాలీ ముగిసిన అనంతరం తిరిగివస్తున్న బస్సు ఈరోజు తెల్లవారు జామున ఒక చెట్టును ఢీకొంది. సారఠ్లోని కెచువాబాక్ మలుపు వద్ద చాంద్నీ బస్సు ఒక చెట్టును బలంగా ఢీకొట్టడంతో ఐదుగురు అక్కడికక్కడే మృతిచెందారు. మరో 32 మంది ప్రయాణీకులు గాయపడ్డారు. క్షతగాత్రులను సీహెచ్సీ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
మృతులంతా మార్గోముండా పోలీస్ స్టేషన్ పరిధిలోని బాఘ్మారా గ్రామానికి చెందినవారని తెలుస్తోంది. ఈ ఘటన జరిగిన సమయంలో బస్సులో మొత్తం 65 మంది ప్రయాణికులున్నారు. గాయపడినవారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉంది. మృతులలో ఒక చిన్నారి కూడా ఉంది. ప్రమాదం గురించి తెలుసుకున్న మాజీ మంత్రి హాజీ హుస్సేన్ సంఘటన స్థలానికి చేరుకుని పర్యవేక్షించారు.
ఇంధన శాఖ కార్యదర్శి చెప్పినా జగన్ వినలేదు: చంద్రబాబు