హరితహారం పై సమీక్షా సమావేశం నిర్వహిస్తుండగా మధ్యలోనే వెళ్ళిపోయిన 88 మంది ప్రభుత్వ ఉద్యోగులకు మహబూబ్నగర్ జిల్లా మహబూబ్నగర్ జిల్లా కలెక్టర్ ఊహించని షాకిచ్చారు. ప్రభుత్వ ఉద్యోగం అంటే అలుసుగా భావించినందుకు సస్పెన్షన్ వేటు వేశారు.
ప్రభుత్వ సూచనల మేరకు హరితహారం, జలశక్తి అభియాన్ పై సమావేశాన్ని కలెక్టర్ నిన్న నిర్వహించారు. ఈ సమావేశానికి హాజరైన 64 మంది ఫీల్డ్ అసిస్టెంట్లు, 24 మంది పంచాయతీ కార్యదర్శులు సమావేశం మధ్యలోనే వెళ్లిపోయారు. దీన్ని గమనించిన జిల్లా కలెక్టర్ రొనాల్డ్ రోస్ వారికి షాకిచ్చారు. మొత్తం 88 మందిని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. కలెక్టర్ తీసుకున్న ఈ నిర్ణయం జిల్లా ఉద్యోగ వర్గాల్లో సంచలనం సృష్టించింది.