telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

ఇంధన శాఖ కార్యదర్శి చెప్పినా జగన్ వినలేదు: చంద్రబాబు

chandrababu fire on AP CS again

ఏపీకి పెట్టుబడులు దూరమవుతాయని ఇంధన శాఖ కార్యదర్శి చెప్పినా జగన్ వినలేదని మాజీ సీఎం చంద్రబాబునాయుడు విమర్శించారు. ఏపీలో గత ప్రభుత్వ హయాంలో కుదిరిన విద్యుత్ ఒప్పందాల(పీపీఏ)పై ప్రస్తుత వైసీపీ ప్రభుత్వం సమీక్షించాలన్న నిర్ణయంపై పలు విమర్శలు తలెత్తున్న విషయం తెలిసిందే.

ఈ సందర్భంగా చంద్రబాబు పీపీఏపై మరోసారి స్పందించారు. పీపీఏపై పున:సమీక్ష మంచిది కాదని కేంద్ర ఇంధన శాఖ చెప్పిందని అన్నారు. జపాన్ రాయబార కార్యాలయం కూడా ఆ మనిషి తలకెక్కేలా కాస్త చెప్పమని భారత్ కు ఓ లేఖ రాసిందని అన్నారు. జగమొండి అనే పదంలో సగం ఆయన పేరులో ఉంటే, మిగతా సగం ఆయన చేసే పనుల్లో ఉందంటూ జగన్ పై విమర్శలు గుప్పిస్తూ వరుస ట్వీట్లు చేశారు.

Related posts