ఏపీకి పెట్టుబడులు దూరమవుతాయని ఇంధన శాఖ కార్యదర్శి చెప్పినా జగన్ వినలేదని మాజీ సీఎం చంద్రబాబునాయుడు విమర్శించారు. ఏపీలో గత ప్రభుత్వ హయాంలో కుదిరిన విద్యుత్ ఒప్పందాల(పీపీఏ)పై ప్రస్తుత వైసీపీ ప్రభుత్వం సమీక్షించాలన్న నిర్ణయంపై పలు విమర్శలు తలెత్తున్న విషయం తెలిసిందే.
ఈ సందర్భంగా చంద్రబాబు పీపీఏపై మరోసారి స్పందించారు. పీపీఏపై పున:సమీక్ష మంచిది కాదని కేంద్ర ఇంధన శాఖ చెప్పిందని అన్నారు. జపాన్ రాయబార కార్యాలయం కూడా ఆ మనిషి తలకెక్కేలా కాస్త చెప్పమని భారత్ కు ఓ లేఖ రాసిందని అన్నారు. జగమొండి అనే పదంలో సగం ఆయన పేరులో ఉంటే, మిగతా సగం ఆయన చేసే పనుల్లో ఉందంటూ జగన్ పై విమర్శలు గుప్పిస్తూ వరుస ట్వీట్లు చేశారు.
అందుకే జగన్ ఢిల్లీలో ప్లేటు ఫిరాయించాడు: మంత్రి యనమల