telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

గీతగోవిందం .. నిర్మాతలపై.. ఐటీ దాడులు.. !

it rides on ga2 pictures

నటుడు విజయ్‌ దేవరకొండ నటించిన, గత సంవత్సరం విడుదలై ఘన విజయం సాధించిన ‘గీతగోవిందం’ నిర్మాతలపై ఆదాయపు పన్ను శాఖ అధికారుల దృష్టి పడింది. నిన్న నిమా నిర్మాతల కార్యాలయాలకు వచ్చిన ఐటీ అధికారులు సినిమా కలెక్షన్లు, చెల్లించిన పన్ను వివరాలను పరిశీలించారు. హైదరాబాద్, బంజారాహిల్స్‌ లోని ‘జీఏ 2 పిక్చర్స్‌’ కార్యాలయానికి వచ్చిన ఐటీ యూనిట్‌ – 14 బృందం, వసూళ్ల రికార్డులను పరిశీలించింది.

ఈ సినిమా సుమారు రూ. 130 కోట్ల వరకూ వసూలు చేసివుంటుందని భావిస్తున్న అధికారులు, ఆ మేరకు పన్నులను చెల్లించారా? లేదా ఏమైనా ఎగ్గొట్టారా? అసలు సినిమా వసూళ్లు ఎంత? అన్న వివరాల లెక్కలు తీస్తూ, నిర్మాణ సంస్థ యాజమాన్యంపై ప్రశ్నల వర్షం కురిపించారు. ‘జీఏ 2 పిక్చర్స్‌’ గతంలో తీసిన రెండు సినిమాల వివరాలు, వాటి ఆదాయాలను, లెక్కలను కూడా పరిశీలించారు.

Related posts