రాశీఖన్నా తెలుగు, తమిళం, మలయాళ భాషలలో నటిస్తూ బిజీగానే ఉంది. 2014లో వచ్చిన ఊహలు గుసగుసలాడే అనే చిత్రంలో కథానాయికగా నటించి తెలుగు ప్రేక్షకుల మనసు దోచుకున్న రాశీ ఖన్నా ఇటీవల విడుదలైన జై లవకుశ,టచ్ చేసి చూడు , తొలి ప్రేమ చిత్రాలతో ఆకట్టుకుంది. ఇక తమిళంలోను తన హవా చూపిస్తున్న రాశీ ఖన్నా.. అధర్వకు జోడీగా ‘ఇమైకా నొడిగల్’ అనే చిత్రం చేసింది. ఈ చిత్రంతో తమిళ తెరకి పరిచయం అయింది. ఆ తర్వాత జయం రవికి జోడీగా ‘అడంగామరు’, విశాల్కి జోడీగా అయోగ్య అనే చిత్రాలలో నటించింది. ప్రస్తుతం సిద్ధార్థ్ హీరోగా తెరకెక్కిన ‘సైతాన్ కా బచ్చా’, “సంగ తమీజన్” , కడాసి విడాసై అనే తమిళ చిత్రంలో నటిస్తున్నారు.
నటుడు విజయ్ సేతుపతి హీరోగా తెరకెక్కుతున్న సంగ తమీజన్ చిత్రంలో మరో హీరోయిన్ గా నివేదా పేతురాజ్ కథానాయికలుగా నటిస్తున్నారు. తాజాగా ఈ చిత్ర షూటింగ్ పూర్తి కావడంతో తన ట్విట్టర్ ద్వారా.. షూటింగ్ పూర్తైంది. నా ఫేవరేట్ హీరో విజయ్ సేతుపతి గారితో పనిచేయడం గౌరవంగా భావిస్తున్నాను” అని ట్వీట్ చేశారు. విజయా ప్రొడక్షన్స్ బ్యానర్ పై విజయ్ చందర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో మొదటిసారి విజయ్ సేతుపతి డ్యూయల్ రోల్ చేస్తున్నారు. ఈ చిత్రానికి వివేక్-మీనన్ ద్వయం సంగీతం అందిస్తుండగా అక్టోబర్ లో ఈ చిత్రం విడుదల కానుంది.
పీవీ కూతురును…మరో శంకరమ్మను చేయబోతున్నారు..