సిమాన్ బర్న్స్ అనే 50 ఏళ్ళ ఐర్లాండ్ మహిళ 2018 నవంబరులో ముంబాయ్ నుంచి లండన్ వెళ్లిన ఎయిర్ ఇండియా విమానంలో రచ్చరచ్చ చేసింది. తనకు అడిగినంత వైన్ పోయలేదని ఫ్లైట్ అటెండెంట్ను అసభ్య పదజాలంతో దూషించింది. తాను పెద్ద క్రిమినల్ లాయర్నని, దేనికి భయపడనని అరుపులు పెట్టింది.సహజంగా విమానంలో ప్రయాణించే ప్యాసెంజర్లు మూడు పెగ్గుల లిక్కర్, మూడు నుంచి నాలుగు గ్లాసుల వైన్ తాగచ్చు. అయితే సిమాన్స్ అప్పటికే నాలుగు క్వాటర్ బాటిళ్ల వైన్ తాగేయడంతో ఫ్లైట్ అటెండెంట్ మరింత వైన్ పోయడానికి నిరాకరించాడు. విమానంలో జరిగిన మొత్తం సన్నివేశాన్ని మిగతా ప్యాసెంజర్లు వీడియో తీసి లండన్ ఎయిర్పోర్టు అధికారులకు చూపించారు. వెంటనే సిమాన్స్ను అదుపులోకి తీసుకున్న ఎయిర్పోర్టు అధికారులు.. ఆమెను కోర్టులో హాజరుపరిచారు. ఏప్రిల్లో ఆమెకు కోర్టు ఆరు నెలల జైలుశిక్షను విధించగా.. రెండు వారాల తరువాత బెయిల్పై విడుదలైంది. కాగా ఇప్పుడామె ఆత్మహత్య చేసుకున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. జూన్ 1న ఇంగ్లాండ్లోని ఆమె నివాసంలో ఆత్మహత్య చేసుకున్నట్టు తెలుస్తోంది. అయితే ఆమె ఆత్మహత్యపై ఎలాంటి అనుమానాలు లేవని లండన్ పోలీసులు చెబుతున్నారు.
previous post