విద్యార్థులు సమయాన్ని వృథా చేయొద్దని మంత్రి హరీష్రావు అన్నారు. సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మధ్యాహ్న భోజన పథకాన్ని మంత్రి నేడు ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఇది పరీక్షా సమయం.. సెల్ఫోన్లు, సినిమాలకు దూరంగా ఉండాలన్నారు.
ఈ ఏడాది ఇంటర్లో వందకు వంద శాతం ఫలితాలుండాని పేర్కొన్నారు. కళాశాలకు రాని విద్యార్థుల జాబితా తీసుకుని గ్రామ సర్పంచ్ సాయంతో తల్లిదండ్రులను కలిసి విద్యార్థులు కాలేజీకి వచ్చేలా సమావేశాలు నిర్వహించాలన్నారు. విద్యాశాఖాధికారులు ప్రతీ రోజు కాలేజీలు తిరుగుతూ విద్యార్థుల చదువుల విషయాన్ని పరిశీలించాలని సూచించారు.