telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

హుజూర్ నగర్ లో కాంగ్రెస్ ఓటమి ..వీహెచ్ సంచలన వ్యాఖ్యలు

hanmanth rao congress

హుజూర్ నగర్ ఉపఎన్నికలో కాంగ్రెస్ పార్టీ ఓటమి చవిచూసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆ పార్టీ సీనియర్ నేత వి.హనుమంతరావు ఘాటుగా స్పందించారు. హుజూర్ నగర్ లో తమ అభ్యర్థి పద్మావతిరెడ్డి ఓటమితో కాంగ్రెస్ పార్టీ గుణపాఠం నేర్చుకోవాలని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ ఉపఎన్నికలో పార్టీ ఓటమి పై సమీక్ష జరగాలని అన్నారు. సమీక్ష జరిగే వరకూ ఉత్తమ్ పీసీసీ అధ్యక్ష పదవికి రాజీనామా చేయొద్దని సూచించారు.ఈ సందర్భంగా ఎంపీ రేవంత్ రెడ్డిపై ఆయన విమర్శలు చేశారు.

రేవంత్ రెడ్డి దగ్గర పైసలు ఉన్నాయని దూకుడు పెంచారని అన్నారు. హుజూర్ నగర్ లో కాంగ్రెస్ గెలిస్తే ఉత్తమ్ కు లాభం అని ప్రచారం చేశారని ఆరోపించారు. ఇతర పార్టీల నుంచి వచ్చిన వారిని అందలమెక్కిస్తున్నారని పార్టీ తీరుపై విమర్శలు చేశారు. పీసీసీ అధ్యక్ష పదవి రేస్ లో నేను ఉన్నాను. ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడ నేనుంటానని వీహెచ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

Related posts