బంగారంకు ఉన్న డిమాండ్ మారేదానికి లేదు. బంగారం ఎంత ధర ఉన్న కొనడానికి ఆసక్తి చూపిస్తారు. అయితే కరోనా వల్ల బంగారం ధరలు భారీగా పెరిగిన విషయం తెలిసిందే. అయితే బులియన్ మార్కెట్లో గత రోజులుగా పెరిగిన బంగారం ధరలు తాజాగా మళ్లీ పెరిగాయి. అటు ఢిల్లీ, ఇటు హైదరాబాద్లోనూ బంగారం ధరలు బాగా పెరిగిపోయాయి. హైదరాబాద్ విషయానికి వస్తే.. బంగారం ధరలు ఇవాళ భారీగా పెరిగాయి. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 330 పెరిగి రూ. 48,000 కు చేరగా… అలాగే 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 300 పెరిగి రూ. 44,000 పలుకుతోంది. బంగారం ధర పెరిగగా.. వెండి ధరలు కూడా భారీగా పెరిగాయి. కిలో వెండి ధర రూ. 1500 పెరిగి రూ.73,400 వద్ద కొనసాగుతోంది.
previous post
next post