హైదరాబాదు నగరంలో స్నాక్స్ కు ఎంతో ప్రసిద్దిగాంచిన గోకుల్ చాట్ లో కరోనా కలకలం రేగింది. ఏకంగా గోకుల్ చాట్ యజమానే కరోనా బారినపడ్డాడు. దాంతో గోకుల్ చాట్ ను అధికారులు సీజ్ చేశారు. లాక్ డౌన్ సడలింపుల నేపథ్యంలో, గోకుల్ చాట్ ను ఇటీవలే తెరిచారు.
కొన్నిరోజులుగా గోకుల్ చాట్ యజమాని అనారోగ్యంతో బాధపడుతుండడంతో ఆయనకు కరోనా వైద్య పరీక్షలు నిర్వహించారు. ఆ వైద్యపరీక్షల్లో పాజిటివ్ అని రావడంతో ఆయనను చికిత్సకు తరలించారు. చాట్ దుకాణంలో పనిచేసే 20 మంది సిబ్బందిని క్వారంటైన్ చేశారు. గత రెండ్రోజులుగా గోకుల్ చాట్ కు వచ్చిన వారి వివరాలు సేకరించే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు.